మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో నేడు జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలుచుకున్న భారత జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. మెరుగైన ర్యాంకుల్లో వార్నర్, జంపా


న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టేన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు, జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం లభించినట్టయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యం సాధించింది.


Also read : ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..


Also read : ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook