MS Dhoni cut Rishabh Pants Instagram Live Cal: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం మంగళవారం భారత స్టార్ ఆటగాళ్లు ట్రినిడాడ్‌ చేరుకొన్నారు. జులై 27న వన్డే సిరీస్ ముగియనుండగా.. 29 నుంచి టీ20 సిరీస్‌ మెదలవుతుంది. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ పొట్టి సిరీస్‌కు సన్నద్ధం అవుతారు. అయితే మంగళవారం సాయంత్రం స్పైడర్ పంత్‌.. కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌లతో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు. ఇది ఎంతో సరదాగా సాగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో భాగంగా రిషబ్ పంత్, రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ అభిమానులతో సంభాషించారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీని లైవ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు పంత్. కాల్ చేయగా ధోనీ సతీమణి సాక్షి సింగ్ లిఫ్ట్ చేసి హయ్ చెప్పారు. ఆపై కూర్చొని ఉన్న మహీకి ఇవ్వగా.. అందరికి హాయి చెప్పారు. ఇంతలో ఇది లైవ్ అని పంత్ చెప్పగానే కాల్ కట్ చేశారు. దాంతో రోహిత్, సూర్య పగలబడి నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. 



వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడడానికి రోహిత్‌ శర్మ, రిషబ్ పంత్‌, భువనేశ్వర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, దినేశ్‌ కార్తిక్‌ తాజాగా వెస్టిండీస్‌కు చేరుకున్నారు. టీ20 సిరీస్ కోసం వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఎంఎస్ ధోనీ తన కుటుంబంతో కలిసి హాలిడేకు వెళ్లారు. వెకేషన్‌లో భాగంగా భార్య సాక్షి సింగ్, కూతురు జీవాతో కలిసి లండన్‌లో మహీ ఎంజాయ్ చేస్తున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


Also Read: స్మృతి మంధాన టూ దీపికా పల్లికల్.. కామన్వెల్త్ గేమ్స్ 2022లో పోటీపడే అందమైన భామలు వీరే! 


Also Read: Ramarao On Duty: ఆసక్తికరంగా రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook