Ind vs Afg T20: ఇండియాలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన రెండవ టీ20లో భారత్ విజయంతో సిరీస్ దక్కింది. రెండవ టీ20లో ఇండియా ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా--ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ మొహాలీలో, రెండవది నిన్న ఇండోర్ వేదికగా జరిగాయి. రెండింట్లోనూ విజయంతో 2-0తో సిరీస్ ఇండియా కైవసం చేసుకుంది. నిన్న జరిగిన రెండవ టీ20లో టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 172 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గుల్బదిన్ అత్యధికంగా 35 బంతుల్లో 57 పరుగులు చేశాడు. గుల్బదిన్ తుపాను ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 
3 కీలక వికెట్లు పడగొట్టిన అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. 


ఇక 173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియా 15.4 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి విజయం సాధించింది. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ 34 బంతుల్లో 68 పరుగులతో చెలరేగిపోయాడు. శివమ్ దూబే 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అటు విరాట్ కోహ్లీ సైతం 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. సిరీస్ ఇప్పటికే ఇండియా కైవసం కాగా మూడవ టీ20 బెంగళూరు వేదికగా జరగనుంది. 


Also read: 2024 IND Vs ENG Test Series: ఉప్పల్‌లో భారత్‌-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook