IND vs SL 2nd Test: బెంగళూరులో భారత్, శ్రీలంకల మధ్య మార్చి 12న రెండో టెస్టు (IND vs SL 2nd Test) ప్రారంభం కానుంది. ఈ సారి జట్టులో స్వల్పమార్పులు  చోటుచేసుకున్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్థానంలో ఆల్‌ రౌండర్ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) జట్టులోకి రానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మొదటి టెస్టులో కుల్దీప్ ఆడలేదు, భారత్ మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది. జయంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్లేమీ తీయలేదు. స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా సంయుక్తంగా 15 వికెట్లు తీసి సత్తా చాటారు.ఇటీవల గాయం కారణంగా అక్షర్‌ పటేల్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు మొదట అక్షర్‌ పటేల్‌నే ఎంపిక చేయాలనుకున్నారు. అయితే అప్పటికీ అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ ని ఎంపిక చేశారు. ప్రస్తుతం అక్షర్ కోలుకుని, పూర్తి ఫిటినెస్ సాధించిన నేపథ్యంలో..దీంతో కుల్దీప్‌ని పక్కన పెట్టినట్లు బీసీసీఐ (BCCI) వర్గాలు వెల్లడించాయి. 2021 ఫిబ్రవరిలో చివరి సారిగా టెస్టు మ్యాచ్‌ ఆడాడు కుల్దీప్‌. అతడికి అక్షర్, జయంత్, వాషింగ్టన్ సుందర్ ల నుంచి తీవ్ర పోటీ ఎదురవ్వడంతో.. కుల్దీప్‌కి జట్టులో చోటుదక్కడం లేదు. 


Also Read: INDW vs PAKW: వైరల్ వీడియో.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ కుమార్తెతో భారత ఆటగాళ్ల సందడి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook