నాగ్ పూర్ :  రెండో టెస్టులో శ్రీలంకపై కోహ్లీ సేన సాధించిన విజయం భారత టెస్టు చరిత్రలో అతిపెద్ద విజయంగా నమోదైంది.  ఈ విక్టరీతో రాహుల్‌ ద్రవిడ్‌ సేన 2007లో బంగ్లాదేశ్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ 239 పరుగుల రికార్డును కోహ్లీసేన సమం చేసింది. కోహ్లీసేన మరొక్క పరుగు ఆదా చేసివుంటే భారత క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయం సొంతం చేసుకొని ఉండేది. రెండో టెస్టులో శ్రీలంక తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 239 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.