IPL 2022: ఐపీఎల్ సీజన్ 15 ఆసక్తికరంగా సాగుతోంది. ఛాంపియన్లు చతికిలబడుతుంటే కొత్త టీమ్‌లు సత్తా చాటుతున్నాయి. అప్పుడే ప్లే ఆఫ్ మాచ్‌ల చర్చ ప్రారంభమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 టీ20 మ్యాచ్‌లు ప్రారంభమై పదిరోజులవుతోంది. అప్పుడే ప్లే ఆఫ్‌ల చర్చ ప్రారంభమైపోయింది. మార్చ్ 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ 15 లీగ్ మ్యాచ్‌లు ప్రస్తుతం ముంబై, పూణేల్లో జరుగుతున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఎక్కడ నిర్వహిస్తారనేది బీసీసీఐ నిర్ణయించలేదు. 


తొలుత ప్లే ఆఫ్ మ్యాచ్‌లు అన్నీ గుజరాత్ మొటేరా స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. దేశంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో వేదికలు విస్తరించాలని ఆలోచిస్తోంది. అదే జరిగితే ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌తో పాటు లక్నో నగరంలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి బరిలో ఉండటంతో అక్కడి అభిమానులు కూడా సొంత గ్రౌండ్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకున్న బీసీసీఐ..ప్లే ఆఫ్ మ్యాచ్‌లను అహ్మదాబాద్, లక్నోలో నిర్వహించేందుకు బీసీసీఐ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. మే 22 తో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అనంతరం మరో వారం రోజులపాటు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 


Also read: JOS Buttler: అంపైర్ కంటే నాకే ఎక్కువగా తెలుసు, బట్లర్ నమ్మకానికి ఫ్యాన్స్ ఫిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook