IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా వేలం సమయం వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న వేలంలో ఏయే క్రికెటర్లు ఎంత ధర పలుకుతారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధర పలికే క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ వేలానికి 10 జట్లు పాల్గొంటున్నాయి. 6 వందల మంది క్రీడాకారులు, 561 కోట్ల డబ్బు సిద్ధమైంది. గుజరాత్ టైకూన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి జరగనున్న వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని అభిప్రాయం ప్రకారం వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే టాప్ ఐదు క్రికెటర్ల గురించి వివరించాడు. టాప్ 5లో శిఖర్ ధావన్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. రెండవ స్థానంలో శార్ధూల్ ఠాకూర్ ఉంటే, మూడవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. ఇక నాలుగవ స్థానంలో యజువేంద్ర ఛాహల్, ఐదవ స్థానంలో ఇషాన్ కిషన్ ఉంటారు. 


ఇక విదేశీ క్రికెటర్లలో అయితే ఆస్ట్రేలియా ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner), ట్రెంట్ బౌల్డ్, జేసన్ హోల్డర్, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్‌కు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ ఐదుగురు విదేశీ క్రికెటర్ల కోసం పది జట్లు గట్టిగానే పోటీ పడనున్నాయి. ఇక కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, వార్నర్, జేసన్ హోల్డర్, కమిన్స్, డుప్లెసిస్, అరోన్ పింఛ్‌లు పోటీ పడవచ్చు. 


Also read: CSK Sketch: ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022లో ధోనీ కన్నేసిన ఆటగాళ్లు వీరే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook