IPL 2020: యూఏఈలో మరోసారి కరోనా కలకలం
ఐపీఎల్ (IPL 2020)ను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కరోనా నుంచి కోలుకుందన్న వార్త వినేలోగా మరో పిడుగులాంటి వార్త. ఐపీఎల్ కోసం పని చేస్తున్న బీసీసీఐ సీనియర్ వైద్య నిపుణుడికి కరోనా పాజిటివ్గా (BCCI Medical Team Member Tested COVID19 Positive) తేలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)ను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సిబ్బంది, ఆటగాళ్లకు కలిపి 13 మందికి కరోనా పాజిటివ్గా రావడం కలకలం రేపింది. తాజాగా ఐపీఎల్ 2020 కోసం యూఏఈకి వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య నిపుణులలో సీనియర్ వ్యక్తి కరోనా (IPL Medical Staff Member Tested COVID Positive) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఏఎన్ఐకి వెల్లడించారు. PM Modi: ప్రధాని మోదీ లక్ష్యంగా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనూ ఇద్దరికి కరోనా సోకినట్లు తెలిపారు. ‘నాకు, కరోనా సోకిందన్న వార్త నిజమే. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నా. త్వరలోనే కోలుకుంటాం. ఏ ఇబ్బంది లేదు. బెంగళూరు ఎన్సీఏలో కూడా ఇద్దరికి పాజిటివ్గా తేలింది. వారు కూడా ఐసోలేషన్లో ఉన్నారంటూ’ బీసీసీఐ మెడికల్ టీమ్ సీనియర్ సభ్యుడు తెలిపారు. IPL 2020: వార్మప్ మ్యాచ్లకు ఐపీఎల్ జట్లు రెడీ
BCCI: దిక్కుతోచని స్థితిలో బీసీసీఐ!
కాగా, సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా కేసులు యూఏఈలో సైతం కలకలం రేపుతున్నాయి. చెన్నై జట్టు, సిబ్బంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం. నేటి మరోసారి కోవిడ్19 నిర్ధారణ టెస్టుల తర్వాత చెన్నై జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్