India vs South Africa: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ జరిగే టీ20 తొలి మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఎంపిక పూర్తయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా టీ20 తొలి మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందే కెప్టెన్ కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్‌లు దూరం కాగా..విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ముందు నుంచే అందుబాటులో లేరు. కేఎప్ రాహుల్ లేకపోవడంతో రిషభ్ పంత్ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నారు. ఐదు టీ 20 మ్యాచ్‌లు ఈ ఇద్దరి నేతృత్వంలోనే జరగనున్నాయి. 


ఇవాళ తొలి మ్యాచ్ ఢిల్లీలో, రెండవ మ్యాచ్ కటక్‌లో , మూడవ మ్యాచ్ విశాఖపట్నంలో, నాలుగవ మ్యాచ్ గుజరాత్ రాజ్‌కోట్‌లో ఐదవ మ్యాచ్ బెంగళూరులో జరగనున్నాయి.టీమ్ ఇండియాను ఓడించి..ఇండియాపై ఉన్న రికార్డు కొనసాగించేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమౌతోంది. ట్రిస్టన్ స్టబ్స్, డొమెస్టిక్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, రీజా హెండ్రిక్స్‌లకు అవకాశం దక్కనుంది. టెంబా బావుమా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్వింట్ డికాక్, మార్క్‌రమ్, రబడ, ఎన్రిచ్ నోర్జె, తబ్రేజ్ షాంసీలు తుది జట్టులో ఆడనున్నారు. 


Also read: Indian Women Cricket: మిథాలీరాజ్‌ రిటైర్మెంట్‌.. టీమిండియా తదుపరి కెప్టెన్‌ ఎవరంటే..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి