టీం ఇండియా మంచి జోషు మీదుంది. వరుసగా తొమ్మిది వన్డేల్లో విజయం సాధించిన భారత జట్టు పదవ వన్డేలో కూడా విజయం సాధిస్తే వరుసగా పది వన్డేల్లో విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా ఘనత సాధించనుంది. భారత వన్డే చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. ఇప్పటి వరకు ఈ ఫీట్ ను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ అందుకున్నాయి.  ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికకానుంది.