సౌత్‌అంప్టన్‌: ప్రపంచ కప్‌లో టీమిండియా ఆరంగేట్రం చేయకముందే జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జూన్ 5న టీమిండియా ఆడనున్న తొలి మ్యాచ్‌లో దక్షిణ ఆఫ్రికాను ఢీకొట్టడానికి సిద్ధపడుతున్న వేళ జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ చేతి వేలికి గాయమైంది. శనివారం సౌత్‌అంప్టన్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో వుండగా కోహ్లీ  కుడి చేతి బొటనవేలికి గాయమైంది. ఆటకు ఇంకా మరో మూడు రోజులే మిగిలి వున్న ప్రస్తుత తరుణంలో టీమిండియా పరుగుల మెషిన్‌ గాయంతో బాధపడుతుండటం అటు తోటి ఆటగాళ్లనే కాకుండా ఇటు క్రికెట్ ప్రియులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.