హైదరాబాద్: అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోలో టీమిండియా సారధి విరాట్‌ కోహ్లీ హల్ చల్ చేశాడు. రెండో టెస్టు కోసం జట్టుతో పాటు హైదరాబాద్ చేరుకున్న కోహ్లీ ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోను సందర్శించారు. కోహ్లీతో పాటు భార్య అనుష్క కూడా హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో వీరుష్కా జోడీ అన్నపూర్ణ స్టూడియోస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా  కోహ్లీ.. అక్కినేని అఖిల్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. ఒక ప్రకటన నటించేందుకు కోహ్లీ ఈ స్టూడియోకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా అభిమాన క్రికెటర్ కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇదిలా ఉండగా కోహ్లీతో కలిసి అఖిల్ దిగిన ఫోటోలు  సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభంకానుంది. తొలి టెస్టులో బంపర్ విజయం సాధించిన కోహ్లీ సేన.. హైదరాబాద్ లో కూడా ఇదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయాలని భావిస్తోంది. దీంతో మ్యాచ్ విక్షించేందుకు నగర వాసులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ విజృంభిస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు