Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీను కేవలం 499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సీజన్ ఆఫర్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 న ప్రారంభమైన ఈ సేల్..సెప్టెంబర్ 30 వరకూ కొనసాగనుంది. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలపై ఆఫర్లు ఆశ్చర్యం రేపుతున్నాయి. ఇప్పుడీ సేల్‌లో 32 ఇంచెస్ డిస్‌ప్లే ఎంఐ టీవీని కేవలం 499 రూపాయలకే పొందవచ్చు.


ఎంఐ 5ఏ 32 ఇంచెస్ హెచ్‌డి రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 24,999 రూపాయలకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 52 శాతం డిస్కౌంట్ అనంతరం 11,999 రూపాయలకు లభిస్తుంది. వివిధ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే..500 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 11 వేల 499 రూపాయలకు లభించనుంది. మీ పాత స్మార్ట్‌టీవీ ఎక్స్చేంజ్‌పై..11 వేలు ఆదా అవుతాయి. ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే..499 రూపాయలకే లభించనుంది. 


ఆండ్రాయిడ్ టీవీలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ హెచ్‌డి రెడీ పిక్సెల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 20 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎంఐ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌ల స్ట్రీమింగ్ ఉంటుంది. 


Also read: Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook