ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తరువాత ఇప్పుడు బిగ్ దీపావళి సేల్ ప్రారంభించింది. ఇందులో కూడా స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందిస్తోంది. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 16 వరకూ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ నడవనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఉత్పత్తులను అత్యంత తక్కువ ధరకే మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ నోకియాను కేవలం 599 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్‌లో నోకియా 4జి స్మార్ట్‌ఫోన్.. నోకియా సి21 ప్లస్ అత్యంత చౌకధరకే లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 11,999 రూపాయలుండగా ఫ్లిప్‌కార్ట్‌లో 11,049 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 599 రూపాయలకే పొందవచ్చు.


నోకియా 4జి స్మార్ట్‌ఫోన్, నోకియా సి 21 ప్లస్ 3 జిబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఆక్టాకోర్ 1.6 జీహెచ్‌జెడ్ ప్రోసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ కెమేరా ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ రెండవ సెన్సార్ ఉన్నాయి. ఇక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. 6.57 ఇంచెస్ డిస్‌ప్లేతో ఉన్న Nokia C21 Plus స్మార్ట్‌ఫోన్ 5050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 


Also read: TCS Share Results: టీసీఎస్ షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్, డివిడెండ్ ప్రకటించిన కంపెనీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook