Sangareddy District: తెలంగాణ(Telangana)లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పాఠశాలల్లో వైరస్ విజృంభించటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ముత్తంగి గురుకుల పాఠశాల(Muttangi Gurukul school)లో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్(Covid-19) గా నిర్ధారణ అయ్యింది. ఈ పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు చేశారు. దీంతో ఆ బాలికకు కొవిడ్‌ నిర్ధారణ అయింది.  నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు(Covid Tests) నిర్వహించగా.. 43 మందికి కొవిడ్‌ సోకింది. మిగతా వారికి నేడు కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.


Also Read: గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థినులకు పాజిటివ్


ఇటీవలె ఖమ్మం జిల్లా(Khammam district)లోని వైరా గురుకుల పాఠశాల(gurukul school)లో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్(Covid-19 Positive)గా నిర్దారణ అయ్యింది. అదే విధంగా హైదరాబాద్ బహదూర్‌పల్లిలోని  టెక్‌ మహీంద్ర వర్సిటీ(Tech Mahindra University)లో 25 మంది విద్యార్థులు, ఐదుగురి సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook