Nalgonda Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు సైతం మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న మద్దిగూడ ప్రసాద్‌ తన కొడుకు అవినాష్‌తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చింతపల్లి వద్దకు రాగానే వారి బైక్ ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం బోల్తా పడింది. ప్రమాదంలో తండ్రీ కొడుకులు ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించడానికి ప్రయత్నించారు. అయితే వారు మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలారు. 


మృతులను పట్నపు మణిపాల్ (18) వనం మల్లికార్జున్ (12), మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు రమణమ్మ (35), మద్దిమడుగు అవినాష్ (12)లు గుర్తించారు. ఇదే ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.  బైక్‌పై వస్తూ యాక్సిడెంట్ అయిన వారు పెద్దఅడిసర్లపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న వారు చింతపల్లి మండలం గుర్రంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Punjab Accident: కెనాల్ లో పడిన బస్సు.. 8 మంది దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook