Etela Rajender Car Accident: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామం వద్ద స్వల్ప ప్రమాదానికి గురైంది. గొర్రెల మంద అడ్డు రాగా.. ఈటల వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకే వస్తున్న ఎస్కార్ట్ వాహనం ఈటల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అందరం క్షేమంగా ఉన్నామని ఈటల రాజేందర్ తెలిపారు. మరో వాహనంలో ఆయన వెళ్లిపోయారు. తృటిలో ప్రమాదం తప్పడంతో బీజేపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మానకొండూరు మండలం, లలితాపూర్ గ్రామం వద్ద నేను ప్రయాణిస్తున్న వాహనానికి మరియు నా సిబ్బంది ఉన్న వాహనానికి ప్రమాదం జరిగింది. చీకటి పడడంతో ఎదురుగా వస్తున్న గొర్రెల మందను చూసి డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఎస్కార్ట్ వాహనం నేను ఉన్న వాహనానికి ఢీకొట్టడంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. భగవంతుని దయవల్ల, ప్రజల ఆశీస్సులతో నాతో  పాటు అందరం క్షేమంగా ఉన్నాము. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.." అని ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. టేక్ కేర్ అన్న అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Telangana Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు  


Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook