Corona Beds In Telangana: తెలంగాణలో కరోనా రెండో దశలో పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కోవిడ్19 మరణాలు సైతం ఏప్రిల్ నెలలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా చికిత్స కోసం పడకలను మరో 25శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ వైద్యశాఖ దీనిపై ప్రకటన విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది కరోనా తొలి కేసు నమోదైన సమయం నుంచి బాధితులకు చికిత్స కోసం కొన్ని పడకలను ప్రభుత్వ ఆసుపత్రులలో కేటాయించారు. తాజాగా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో పడకల సంఖ్యను పెంచి త్వరగా బాధితులకు చికిత్స అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,281 పడకలకుగానూ ప్రస్తుతం 6,654 ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే ఈ 25 శాతం పడకలు కరోనా వైరస్(CoronaVirus) చికిత్సకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా టెస్టుల సంఖ్యను సైతం తెలంగాణ సర్కార్ పెంచింది.


తెలంగాణలో తాజాగా 3,307 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,045కు చేరింది. కరోనా(Corona Symptoms) మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో ఎనిమిది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,788కి చేరింది. తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Also Read: COVID-19: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా మరణాలు, తాజాగా 3,307 కోవిడ్19 కేసులు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook