Telangana Govt: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందడి మెుదలైంది. రాములోరి ఆలయాలన్నీ శ్రీరామనవమికి ముస్తాబు అవుతున్నాయి. శ్రీరాముడి జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రకటించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఆరోజు తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అవుతాయి. దీంతో స్టూడెంట్స్ పండగ చేసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర..
మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీరామనవమి శోభాయాత్రకు శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర హైదరాబాద్ ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభం అవుతుంది. దీనిని విజయవంతంగా చేయాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు రాజా సింగ్. ఈ శోభా యాత్ర సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ యాత్ర ఏయే మార్గాల్లో సాగుతుందో ఆక్కడ భద్రతను పెంచనున్నారు. 


Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్స్‌ దుకాణాలు బంద్‌.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?


ముస్తాబు అవుతున్న అయోధ్య..
అయితే ప్రతి ఏటా చైత్ర శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. దీని ప్రకారం, ఏప్రిల్ 17న ఈ పండుగను చేసుకోనున్నారు. హిందూ మత గ్రంథాల ప్రకారం, శ్రీరామచంద్రుడు ఈ రోజే జన్మించాడని నమ్ముతారు. రాములోరి జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరామనవమి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని కన్నుల పండువగా ముస్తాబు చేయనున్నారు. ఆ రోజు ఏకపత్నివ్రతుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుండి సుమారు 50 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీని కోసం అయోధ్య ట్రస్టు భారీగా ఏర్పాట్లు చేస్తుంది. 


Also Read: Epuri Somanna : కేసీఆర్‌కు భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన ప్రముఖ గాయకుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter