హైదారబాద్: సినీ నటుడు రాజశేఖర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం అర్థరాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వస్తుండగా మార్గం మధ్యలో ఆయన కారు ముందున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు స్వల్ప గాలయాలయ్యాయి.  ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి రాజేంద్రనగర్  పివి ఎక్స్ ప్రెస్ హైవేపై చోటుచేసుకుంది. రాజశేఖర్ మద్యం మత్తులో తన కారును ఢీకొన్నారని ముందు కారులో ప్రయాణిస్తున్న రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా  సమాచారం అందుకున్న రాజశేఖర్ భార్య జీవిత పోలీస్ స్టేషన్ చేరుకొని రాజీకుదర్చడంతో  కేసు నమోదుకాలేదు. తల్లి చనిపోయిన డిప్రెషన్ లో రాజశేఖర్ కారు నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని..మద్యం సేవించి సేవించి డ్రైవ్ చేయడంవల్ల కాదని బ్రీత్ అనలైసర్  టెస్ట్ పరీక్షల అనంతరం పోలీసులు తెలిపారు.