హైదరాబాద్ ఉప్పల్ లో చిలుకనగర్ లో చిన్నారి తల దొరికిన కేసును పోలీసులు ఛేదించారు. తల దొరికిన ఇంటి యజమాని రాజశేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని, చంద్ర గ్రహణం రోజున నరబలి ఇస్తే ఆమె అనారోగ్యం నయమవుతుందని ఎవరో చెప్తే చేశానని ఒప్పుకున్నాడు. పాపను కరీంనగర్ తండాలో కొనుగోలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే దీనిపై పోలీసుల నుండి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.


ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించారు. అనుమానితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారించారు.