తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ వ్యక్తి బుధవారం ఆమె ప్రియుడిని హతమార్చిన ఘటన హైదరాబాద్ శివార్లలోని జవహార్ నగర్ లో చోటుచేసుకుంది. జవహార్ నగర్ కి చెందిన రాజు, లక్ష్మీ ఇద్దరూ భార్యాభర్తలు. తన భార్య లక్ష్మీ మల్కాజిగిరికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. అదే ఆగ్రహంతో వెళ్లి ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు, అతడి బంధువులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతి చెందినట్టు ఆస్పత్రిలోని వైద్యులు స్పష్టంచేసినట్టు సమాచారం.


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.