Hyderabad Metro Interrupted | హైదరాబాద్ మెట్రో సేవలు సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. మియాపూర్, అమీర్ పేట్ మధ్య రూట్ లో సాంకేతిక కారణం వల్ల ప్రయాణం కాసేపు ఆగిపోయింది. అయితే మెట్రో అధికారులు వెంటనే స్పందించారు. రంగంలోకి దిగి రిపెయిర్ చేయడంతో ట్రైన్ ముందుకు కదిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!


అయితే ప్రయాణంలో అంతరాయం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాసేపు ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. 


ఇటీవల కాలంలో హైదరాబాద్ ( Hyderabad ) మెట్రోలో ( Hyderabad ) ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రయాణికుల సంఖ్య విషయంలో ఇది రెండో స్థానంలో ఉంది. లక్నో మొదటి స్థానంలో ఉంది.  ప్రతీ రోజు సుమారు 1.30 ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకుంటున్నారు.


మెట్రో ( Hyderabad Metro) అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు, సేఫ్టీ లెవల్స్ ను నమ్మి ప్రయాణికులు మెట్రో ప్రయాణం వైపు ఆసక్తి చూపుతున్నారు. దాంతో పాటు ఇటీవలే మెట్రో పలు ఆఫర్లు కూడా ప్రకటించింది. ఇటీవలే మెట్రో సువర్ణ అనే స్కీమ్ లాంచ్ చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి 30 శాతం ప్రయాణికులు పెరిగారు. మెట్రో సువర్ణ కార్డు తీసుకున్నవారికి 90 రోజుల వరకు ప్రయాణంలో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.



Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR