మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎంపీ సుబ్బిరామిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం దేవెగౌడ సుబ్బిరామిరెడ్డి వెంట ఆయన నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయన తాను బస చేసే హోటల్‌కు వెళ్ళిపోయారు. ఆదివారం జరిగే సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌కు వచ్చారు.


ఆదివారం దేవెగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సమావేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌, జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించనున్నారు. అనంతరం బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే తదితరులు ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ నేతలు సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహంతోపాటు మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి కుమారుడి పెళ్లికి వారు హాజరుకానున్నారు.