వరంగల్‌లోని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో ఎండీ హోమియో, ఎండీ ఆయుర్వేద, ఎండీ యునానీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అలాగే ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సిలింగ్‌కు యూనివర్సిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఈనెల 11న అసలు ధ్రువపత్రాలతో ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ కేంద్రం(ప్రొఫెసర్ జి రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్)లో హాజరు కావాలని ఈ ప్రకటనలో పేర్కొంది. 


అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన ఇతర వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా యూనివర్శిటీ ప్రకటించింది.