హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత లెజెండరీ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో మంత్రి కేటీఆర్‌ను కలిసిన కపిల్ దేవ్.. డిసెంబర్‌లో గోల్ఫ్ టోర్నమెంట్ జరగనుందని, అందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. కపిల్‌ దేవ్‌ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ భేటీలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.