KCR:  తెలంగాణ ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నరేళ్లు  కేసీఆర్ రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించారు.  తెలంగాణ ఫస్ట్ ఛీఫ్ మినిస్టర్ గా  కేసీఆర్ గుర్తింపు పొందారు. అంతేకాదు ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే కీలక బాధ్యతలు తీసుకున్నాడు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. సంచలనమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ జనాలకు చాలా దగ్గరయ్యారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాయి.. ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పరిపాలనా దక్షతను పలువురు కొనియాడారు. రైతుబంధు, 24 గంటల కరెంట్ లాంటి పథకాలతో తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ మరింత దగ్గరయ్యారు. సమైక్య పాలనకు ప్రత్యేక రాష్ట్రంలో పాలనకు తేడాను చెబుతూనే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి కేసీఆర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. అప్పటినుంచి ఫాం హౌజ్ లోనే కేసీఆర్ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. గడిచిన పది నెలల కాలంలో అడపాదడపా హైదరాబాద్ లోని నంది నగర్ నివాసం లేదా తెలంగాణ భవన్ కు మాత్రమే వచ్చారు. మిగితా సమయం అంతా ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కేసీఆర్ ఫాం హౌజ్ లో ఏం చేస్తున్నారనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత కేసీఆర్ డీలా పడ్డారని కొందరు, ఓటమి నుంచి కేసీఆర్ కోలువకోవడం లేదని అంటున్నారు. ఇంకొందరైతే అసలు కేసీఆర్ ఆనారోగ్యంతో బాధపడుతున్నారని ఇలా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని బీఆర్ఎస్ వర్గాలు, కేసీఆర్ సన్నిహిత వర్గాలు చాలా సందర్భాల్లో కొట్టిపారేశాయి. ఇంతకీ మరి కేసీఆర్ ఫాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అందరిలో అనుమానం ఉంది. అయితే ఫాం హౌజ్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తే చాలా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫాం హౌజ్ కు వెళ్లిన కేసీఆర్ దినచర్య చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట. తనకు ఎంతో మక్కువైన వ్యవసాయంపై ఎక్కువ సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారట. వీలు చిక్కినప్పుడల్లా వ్యవసాయం క్షేత్రం కలియ తిరుగుతా అక్కడి పనివాళ్లకు సూచనలు చేస్తున్నారట. ఏ పంట వేస్తే బాగుంటుంది. పంటకు ఎప్పుడు ఏ మందులు వాడాలి. మంచి దిగుబడి రావడానికి ఏం చేయాలో పని వారికి సూచనలు చేస్తూ సమయం గడుపుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.


గతంలో ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో కేసీఆర్‌.. కొంత అలసటగా ఫీల్‌ అయ్యేవారట. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నారట. ఎన్నికల తర్వాత చాలా మంది కార్యకర్తలు ఓటమిని తట్టుకోలేక కేసీఆర్ ను కలిసి బాధపడుతుంటే కేసీఆరే వారిని ఓదార్చినట్టు తెలిసింది. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ప్రజా నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి..ఆ ప్రజలే నిర్ణయమే అంతిమం అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారట. అంతే కాదు కేసీఆర్ మాటలు.. ఆయన తీరు చూసిన నేతలు, కార్యకర్తలు షాక్ అవుతున్నారట. కేసీఆర్ గురించి బయట ఏదేదో జరుగుతుంది కానీ అసలు ఫాం హౌస్‌లో కేసీఆర్ చాలా ప్రశాంతంగా ఉంటున్నారని నేతలు చెబుతున్నారు. అంతేకాదు కాస్తా ఖాళీ సమయం దొరికితే చాలు కేసీఆర్ వెబ్ సిరిసీలు కూడా చూస్తున్నారట. ఇటీవల పలు ఓటీటీలో వచ్చిన కొన్ని ఆసక్తికర పొలిటికల్ డ్రామాలను కేసీఆర్ తెగ చూసినట్టు టాక్. మరోవైపు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఇటీవల రిలీజ్ అయ్యాయా... వాటి వివరాలపై ఆరా తీస్తున్నారట. తనకు ఎంతగానో ఇష్టమైన పుస్తకాలను కేసీఆర్ చదువుతున్నారట. మధ్య మధ్యలో తెలంగాణలో సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ అప్డేట్స్ ను కూడా ఫాలో అవుతున్నారట. జనాలు ఏం అనుకుంటున్నారని సోషల్ మీడియా ద్వారా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.


గత 5 దశాబ్దాలుగా రాజకీయాలతో ప్రతినిత్యం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన 2001 నాటి నుంచి  మొన్నటి వరకు కేసీఆర్ చాలా బిజీగా బిజీగా మారారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాంటి కేసీఆర్ ఇటీవల కాస్తా ప్రశాంతంగా ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. దీనికి తోడు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయాన్ని కేసీఆర్ గడుపుతున్నారట. ఈ మధ్య కాలంలో కేసీఆర్ తమకు ఎక్కువ సమయం కేటాయిస్తుండంతో తెగ సంతోష పడుతున్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు తనను కలవాలనుకున్న సన్నిహితులకు స్వయాన కేసీఆర్ ఫోన్ చేసి ఫాం హౌజ్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నట్టు తెలిసింది. మరోవైపు కేసీఆర్ రాజకీయంగా ఏం చేయబోతున్నారని కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. గత కొద్ది నెలలుగా రాజకీయంగా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. సార్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుంది.కాంగ్రెస్ పాలనలో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు వచ్చి వారికి భరోసా ఇస్తే బాగుంటుందని నేతలు అడిగితే వారికి కేసీఆర్ నుంచి ఊహించని సమాధానం ఎదురైందంట. ఇప్పుడే ప్రజాక్షేత్రంలోకి వస్తే కాంగ్రెస్ కు సానుభూతి రావొచ్చు. కనీసం పది నెలల గడువు ఇవ్వక ముందే విమర్శలు చేస్తే బాగుండదు. అయినా అతి త్వరలో జనాలు కేసీఆర్ నువ్వు మాకు అండగా నిలవాలని రోడ్డు మీదకు వస్తారు. అప్పుడు ఖచ్చితంగా జనాలకు తోడుగా వస్తాను అని కేసీఆర్ అన్నారట. అప్పటి వరకు పార్టీ ముఖ్య నేతలు ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పారట. అంతే కాదు పార్టీకీ అవసరమైన తగు సూచనలు చేస్తానని చెప్పినట్టు సమాచారం.


మొత్తంగా బయట జరుగుతున్న ప్రచారాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ చాలా కూల్ గా ఉంటున్నట్టు సమాచారం. ఫామ్‌ హౌజ్ లో తనకు ఇష్టమైన పనులను చేస్తూనే మరోవైపు  తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలతో  కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారట. అతి త్వరలోను మళ్లీ సార్ బయటకు వస్తారు. కారును పరుగులు పెట్టిస్తారు అని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.