Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉపఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏం జరిగినా మునుగోడుకు లింకులు బయటపడుతున్నాయి. పార్టీల వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. నేతల ప్రకటనలు మంట పుట్టిస్తున్నాయి. మునుగోడుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన సోదురుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ చేయలాంటూ కాంగ్రెస్ నేతలకు ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ లీకై వైరల్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కలవరం రేపింది. ఆ ఆడియో లీక్ ఘటన మరవకముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన మరో వీడియో బయటికి వచ్చింది. తాజాగా వచ్చిన వీడియోలోనూ మునుగోడు ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉప ఎన్నికలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయినా ఆయన మాత్రం ప్రచారానికి వెళ్లడం లేదు. మునుగోడుకు వెళ్లకుండా తన  కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు వెంకట్ రెడ్డి. మునుగోడులో తన తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇష్టం లేకనే వెంకట్ రెడ్డి విదేశీ టూర్ కు వెళ్లారనే టాక్ నడుస్తోంది. ఆస్ట్రేలియాకు వెళ్లిన వెంకట్ రెడ్డి.. అక్కడ తనను రిసీవ్ చేసుకోవానికి వచ్చిన అభిమానులతో మాట్లాడిన వీడియో బయటికి వచ్చింది. అందులో మునుగోడు ఉప ఎన్నికపై సంచలన కామెంట్లు చేశారు కోమటిరెడ్డి. ఉప ఎన్నికలో ఎవరూ గెలవబోతున్నారో.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో చెప్పారు.


మునుగోడులో తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాను వెళితే పది ఓట్లు ఎక్కువ పడతాయి తప్ప కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని చెప్పారు. 25 ఏళ్లుగా పాలిటిక్స్ లో ఉన్నానని తెలిపారు. పాదయాత్ర చేద్దామంటే పార్టీలో ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఎయిర్ పోర్టులో కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.


తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ  మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేత జబ్బార్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా.. తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా. మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా అని అందులో ఉంది. అయితే ఆ ఆడియో 2018 ఎన్నికల సందర్భంగా తనతో వెంకట్ రెడ్డి మాట్లాడినదని జబ్బార్ చెబుతున్నారు. శుక్రవారం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నవంబర్ 7న తిరిగి రానున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. 6వ తేదీన లెక్కింపు జరగనుంది.


Read Also: Weather Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. అప్రమత్తమైన అధికారులు


Read Also: AP Capital: మూడు రాజధానులపై వైసీపీ రాజీనామా స్కెచ్.. టీడీపీ కౌంటర్ ఏంటో?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook