Yadadri temple: 3 కిలోల బంగారం విలువైన నగదు విరాళం ఇచ్చిన Minister Malla Reddy
Minister Malla Reddy donates Rs 1.75 crores cash to Yadadri temple: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్లోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు (Minister Malla Reddy family), అనుచరులు, పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం యాదాద్రిని సందర్శించి ఈ విరాళం అందజేశారు.
Minister Malla Reddy donates Rs 1.75 crores cash to Yadadri temple: హైదరాబాద్ : మంత్రి మల్లా రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయాన్ని సందర్శించి భూరి విరాళాన్ని అందించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం విమాన గోపురం బంగారం తాపడం కోసం ఆలయ అధికారులు 3 కిలోల బంగారం కొనుగోలు చేయడానికి వీలుగా అంతకు సమాన విలువైన నగదును మంత్రి మల్లా రెడ్డి గురువారం ఉదయం అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేసినట్లు మంత్రి మల్లా రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) పిలుపు మేరకు తన కుటుంబం తరపున ఒక కిలో బంగారం, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరపున మరో 2 కిలోలు చొప్పున మొత్తం 3 కిలోల బంగారం విలువ చేసే రూ. 1.75 కోట్ల మొత్తాన్ని నర్సింహ స్వామి దేవస్థానానికి (Laxmi Narsimha swamy temple) అందించినట్టు మంత్రి మల్లా రెడ్డి వెల్లడించారు. రూ. 1.75 కోట్ల మొత్తంలో రూ. కోటి నగదు కాగా, మిగతా రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయని మంత్రి తెలిపారు.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్లోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు (Minister Malla Reddy family), అనుచరులు, పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం యాదాద్రిని సందర్శించి ఈ విరాళం అందజేశారు.