నిర్భయ ఘటనలో దోషులకు ఉరి శిక్ష విధించినా . .  దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా .. మృగాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. అభం శుభం ఎరుగని అమ్మాయిలపై అత్యాచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో మరో అత్యాచారం ఘటన వెలుగు చూసింది. 
వికారాబాద్ జిల్లా పరిగిలోని బీసీ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అదే కాలనీకి చెందిన సాయి అనే యువకుడు 10 ఏళ్ల మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో .. విషయం వెలుగు చూసింది. బాలిక దగ్గర విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.. యువకున్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మాయి మేన మామ ఇంటి వద్ద ఉంటోంది.
పోక్సో, నిర్భయ చట్టం కింద కేసులు 
నిందితుడు సాయిపై పోక్సో,  నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు బాలికను ఆస్పత్రికి తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..