NIA probes Udaipur Tailor Murder Case: హైదరాబాద్: దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రదాడులు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లో వెలుగుచూడటం ఎప్పుడూ చూస్తున్న విషయమే. తాజాగా మరోసారి అదే విషయాన్ని నిరూపిస్తూ ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జరిగిన టైలర్ మర్డర్ కేసులోనూ మరో నిందితుడు హైదరాబాద్‌లో అరెస్ట్ అవడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఉన్న సంతోష్ నగర్‌లోని లక్కీ హోటల్ సమీపంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పక్కా సమాచారం మేరకే సోదాలు జరిపిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు.. లక్కీ హోటల్ సమీపంలోని ఓ ఇంట్లో బీహార్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ ఉదయపూర్ టైలర్ ఖనయ్య లాల్ సాహు హత్య కేసులో ఈ బీహార్ వ్యక్తిని మరో నిందితుడిగా చేర్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.


Also read : Heavy Rains In Telangana : తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత


Also read : Revanth Reddy: ఢిల్లీలో టీకాంగ్రెస్ పంచాయితీ.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్! త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook