హైదరాబాద్: అధికారంలోకొచ్చాకా తమ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని కేసీఆర్.. గ్రామాల్లో నాటిన చెట్లను కాపాడకపోతే ఉద్యోగస్తుల ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారని ఎద్దేవా చేశారు.


సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన పొన్నాల లక్ష్మయ్య.. తెలంగాణకు కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రూ.2లక్షల కోట్లకుపైగా అప్పుల పాలైందని ఆరోపిస్తూ.. మరీ కేసీఆర్‌ చేసిన అన్యాయాలపై ప్రజలు ఎలాంటి శిక్ష వేయాలని నిలదీశారు.