తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను అనుసరించి నవంబర్‌ 8వ తేదీ వరకు అసెంబ్లీ చుట్టుపక్కల నాలుగు కిలో మీటర్ల మేరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు నవంబర్‌ 2 ఉదయం 6 గంటల  నుంచి  8వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు అమలులో ఉంటాయన్నారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యల తప్పవని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING