Revanth Reddy About Rajagopal Reddy: తెలంగాణ కోసం పోరాటాలు చేశామని చెప్పుకుంటున్న కొంతమంది ముసుగువీరులు తెలంగాణనే కించపరిచిన వారి చెంతన చేరుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ స్వార్థం లేదంటూనే తమ ఆర్థిక ప్రయోజనాల కోసం, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విసిరిన ఎంగిలి మెతుకుల కోసం, తమ అవసరాల కోసం, ఇచ్చిన కాంట్రాక్టులను నిలబెట్టుకోవడం కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించేలా, అవహేళన చేసేలా గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING