Sabitha Indra Reddy About TS Inter 2nd Year Exams 2021: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేశారని కథనాలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దు (TS Inter 2nd Year Exams Cancelled) విషయంపై మంత్రి సబితను జర్నలిస్టులు ప్రశ్నలు అడిగారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశాం, కానీ ఇంటర్ సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్స్‌ నిర్వహణ, రద్దుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు.


Also Read: TS Inter 2nd Year Exams: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు 


విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రకటన చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అయితే తెలంగాణలో జూన్ 8న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించినే కేబినెట్ భేటీ (Telangana Cabinet Meeting)లో పలు అంశాలతో పాటు పరీక్షలపై చర్చించినట్లు సమాచారం. కాగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుందని, సాయంత్రం అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 


Also Read: TS Cabinet meeting important points:తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook