Suicide for Chicken: తెలంగాణలోని దుండిగల్ పరిధిలో దారుణం జరిగింది. భార్య చికెన్ కర్రీ వండలేదనే కోపంతో యాసిడ్ తాగి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి.. భార్యను కోడికూర వండమని చెప్పాడు. అయితే ఆమె వండలేదని కోపంతో యాసిడ్ తాగిన భర్త తొలుత ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిదంటే?


దుండిగల్ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన ఆటోడ్రైవర్‌ రతన్‌లాల్‌ (32) దుండిగల్ లో అద్దెకు ఉంటున్నారు. ఆ వ్యక్తి రతన్ లాల్ మూడేళ్ల క్రితం తన భార్య రాధికతో కలిసి దుండిగల్ వచ్చి నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. 


మార్చి 25న సాయంత్రం మద్యం తాగి వచ్చిన రతన్ లాల్.. కోడి మాంసం కొని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే వాళ్ల కుమార్తెకు చికెన్ పాక్స్ సోకడం వల్ల ఇంట్లో కూర వండడం కుదరదని భార్య తేల్చి చెప్పింది. అయినా వినకుండా రతన్ లాల్.. భార్యతో గొడవ పడ్డాడు. 


ఆ మరుసటి రోజు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రతన్ లాల్ తన తల్లికి ఫోన్ చేసి యాసిడ్ తాగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యి.. ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దుండిగల్ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి తెలిపారు.  


Also Read: KCR Appeal to Modi: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ... ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల కోసం...


Also Read: Rahul Gandhi vs Minister KTR: రాహుల్ జీ అంటూనే.. గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook