TS SSC Results Date: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు కోసం విద్యార్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తవడంతో ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్దమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 5.08 లక్షలమంది హాజరయ్యారు. వీరిలో 2,7,952 మంది బాలురు కాగా, 2,50, 433 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకూ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాకనం 19 కేంద్రాల్లో జరిగింది. కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తోంది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా పదో తరగతి ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 24 అంటే రేపు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపధ్యంలో మరో వారం రోజులకు అంటే ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. 


తెలంగాణ పదో తరగతి ఫలితాలను https://results.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా కేవలం మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఫలితాలతో పాటు మార్కుల మెమో కూడా ఉంటుంది. గత ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13తో ముగియగా ఫలితాలు మే 10వ తేదీన విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ముందే పరీక్షలు ముగిశాయి. 


Also read: Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook