తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి పర్వదినం ఎల్లప్పుడూ ఓ ప్రతీకగా నిలుస్తుందని శాంతికి, మత సామరస్యానికి, సమసమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. 


మరోవైపు రాష్ట్ర ప్రజలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఈ దీపావళి వారి జీవితాల్లో కోటి కాంతులు వెదజల్లాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.