హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఖాళీగా ఉన్న వివిధ కమిటీలకు చైర్మన్లను, సభ్యులను నియమిస్తూ తెలంగాణ సర్కార్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంఐఎం పార్టీ శాసనపక్షా నేత అక్బరుద్దీన్ ఒవైసీని తెలంగాణ సర్కార్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా నియమించింది. అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్ రెడ్డిని నియమించింది. అలాగే ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా సొలిపేట రామలింగా రెడ్డి, రైల్వే జోనల్ కమిటీ సభ్యుడిగా నన్నపనేని నరేందర్‌ను నియమించారు.