దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఎటువంటి ఆహ్వానం అందకుండానే మంత్రి కేటీఆర్ అక్కడకు వెళ్లారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటైన రిప్లై ఇచ్చారు. తనకు ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి అందిన ఆహ్వానం లేఖలని జతపరుస్తూ ఓ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ లోనే కాంగ్రెస్ నేతకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ గారూ.. తానేమీ పప్పుని కాదని, హుందాగా మీ ( ఉత్తమ్ కుమార్ రెడ్డి) తప్పు మీరు తెలుసుకుని సరిదిద్దికుంటారని ఆశిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసిన ట్వీట్‌కి ట్విటర్‌లో భారీ రెస్పాన్స్ కనిపించడం విశేషం.