Koppula Eshwar Corona Positive: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నిర్వహించిన టెస్టులోలో కొప్పుల ఈశ్వర్‌కు కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఇటీవల తనను కలిసినవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఏ లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోవిడ్19 నిబంధనలు పాటించాలని సూచించారు. భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు కేసులు నమోదయ్యాయి. 



దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,65,428 శాంపిల్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 4,03,738 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కు చేరింది. అదే సమయంలో 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే దేశంలో 4,092 మందిని కోవిడ్19 మహమ్మారి బలితీసుకుంది. 


Also Read: India COVID-19 Cases: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook