సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు  ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిముషాలు' కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతే కాదు స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని .. అందరిలో స్ఫూర్తి నింపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మంత్రి కేటీఆర్... ఈ రోజు ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటి పరిశీలనతో పాటు, పూల కుండీలను శుభ్రం చేశారు. వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరిచారు. దీంతోపాటు ప్రగతిభవన్లో ని గార్డెన్ వంటి ఏరియాల్లో ఎక్కడైనా వాన నీరు పేరుకుపోయిందేమోనని పరిశీలించారు. 


ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరంతరం  పది వారాల పాటు కొనసాగించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే..  మలేరియా, డెంగ్యూ, చికెన్  గునియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.  

పురపాలక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌరుడు వారానికి పది నిమిషాలపాటు ఆదివారం రోజు కేటాయించి పరిసరాల పరిశుభ్రత పైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..