తెలంగాణ వ్యాప్తంగా వున్న మొత్తం 119 నియోజకవర్గాలకుగాను కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ సభ్యులను నియమించింది. ఈ మేరకు కొత్త పీసీసీ సభ్యుల పేర్లతో కూడిన జాబితాను సోమవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జనవరిలోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గం నుంచి రెండేసి బ్లాకుల చొప్పున ఇద్దరు అభ్యర్థులను పార్టీ పరిగణనలోకి తీసుకుంది. పీసీసీ సభ్యులుగా నియామకం పొందిన వారికి పీసీసీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. 


ఈ సారి పీసీసీ అధ్యక్ష పదవికి పార్టీలో పెద్దగా పోటీ లేకపోవడం, పీసీసీ చీఫ్ నియామకం నిర్ణయం పార్టీ అధిష్ఠానం చేతుల్లోనే వుండటంతో రాష్ట్రంలో తర్వాతి పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.