Telangana Rain Updates: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు విపరీతంగా పొంగిపొర్లుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. భారీ వర్షాలు, వరదలతో పాత భవనాల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి.. వాటిని కూల్చేస్తున్నారు. ఇప్పటివరకూ 40 భవనాలను కూల్చివేశారు. మరో 78 భవనాలను సీజ్ చేసి.. అందులోని ప్రజలను తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నగరంలో శిథిలావస్థకు చేరిన మొత్తం 524 భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా పాత భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు నగరవ్యాప్తంగా ప్రతీ కాలనీలో పాత భవనాలను గుర్తిస్తున్నారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.


కాగా, తెలంగాణలో ఇవాళ కూడా 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 


Also Read: Telangana Rain Updates: మరింత బెంబేలెత్తించనున్న వానలు.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్


Also Read: Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook