Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 3,801 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం బుధవారం సాయంత్రం వెల్లడించింది. మొత్తం 88,867 టెస్టులకుగానూ.. ఈ కేసులు (Telangana Corona update) నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో 1,570 కేసులు ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే రావడం (Corona cases in GHMC) ఆందోళనకరం.


మంగళవారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు (బుధవారం) సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.


రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,47,155 వద్దకు చేరింది.


రాష్ట్రంలో కరోనా రికవరీలు..


ఇక గడిచిన 24 గంటల్లో 2,046 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,95,942 మంది కరోనాను (Corona recoveries in Telangana) జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.37 శాతానికి తగ్గింది.


మహమ్మారికి రాష్ట్రంలో తాజాగా ఒకరకు బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,078కు చేరినట్లు (Corona deaths in Telangana) ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.55 శాతంగా ఉంది.


తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 38,023 యాక్టివ్​ కొవిడ్ కేసులు (Corona Acitve cases in Telangana) ఉన్నాయి.



రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,16,78,469 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,51,114 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 5,433 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని (Corona tests in Telangana) పేర్కొంది.


Also read: Telangana Drugs Case : తెలంగాణలో డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతామంటోన్న సీఎం కేసీఆర్‌‌


Also read: Green Channel in Hyderabad: హైదరాబాద్‌లో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook