Telangana COVID-19 Positive Cases: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమయం నుంచి తెలంగాణలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లోనే 80 శాతానికి పైగా కరోనా కేసులు వస్తున్నాయి. తెలంగాణలో తాజాగా 431 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 68,171 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 431 మందికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. వీటితో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 4 వేల 2 వందల తొంబై ఎనిమికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,676కి చేరింది.


Also Read: Corona Vaccine: దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా టీకాలు, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం


నిన్న ఒక్కరోజు కోలుకున్న వారి సంఖ్య కన్నా పాజిటివ్ కేసులే అధికంగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. మంగళవారం నాడు 228 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 2,99,270 మంది కరోనాను జయించారు. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 111 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడం హైదరాబాద్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.


Also Read: COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook