ఇటీవల జరిగిన ఎన్నికల సమయం నుంచి తెలంగాణలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఆరు రాష్ట్రాల నుంచే 80 శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో తాజాగా 495 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శనివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 58,029 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 495 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 5 వేల 8 వందల 4కు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,685కి చేరింది.


Also Read: Holi 2021 వేళ విజృంభిస్తున్న Corona.. వివిధ రాష్ట్రాల్లో ఇలా కఠిన చర్యలు, ఆంక్షలు


గత పది రోజులుగా కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. బుధవారం నాడు 247 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 2,99,427 మంది కరోనా మహమ్మారిని జయించారు. 


జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 142 జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా హాస్టళ్లు, మెస్‌లు మూసివేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు నిరసన సైతం తెలిపాయి. 


Also Read: Wine Shops In Hyderabad: మందుబాబులకు షాక్, హోలీ పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు బంద్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook