తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిసి టీపీసీసీ నేతలు మాట్లాడుతున్న సందర్భంలో చోటు చేసుకున్న చిన్న ఘర్షణ, తగాదా వరకు వెళ్లింది. ఆఖరికి గవర్నరు అని కూడా ఆయనను కూడా దుర్భాషలాడారు టికాంగ్రెస్  నేతలు. టికాంగ్రెస్ నాయకులు సర్వే సత్యనారాయణ, మల్లురవిలతో మాట్లాడుతూ గవర్నర్, కొత్త సంవత్సరంలో ప్రభుత్వానికి ప్రతపక్షం కూడా సహకరించాలని కోరగా.. వారి మధ్య ఏర్పడిన వాదన ఘర్షణకు దారితీసింది.


దళితుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి సహకరించేది లేదని కాంగ్రెస్ నేతలు తెగేసి చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే మీకు గవర్నరు పోస్టు వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలనే మాట కూడా వారు గవర్నరును ఆడడంతో.. గవర్నరు సైతం వారిపై ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఇది మాట్లాడే పద్ధతి ఏమాత్రం కాదని హితవు చెప్పారు. అయితే తాము గవర్నరుని వచ్చి ఎట్టి పరిస్థితిలోనూ కలిసేది లేదని.. తాము తేల్చుకొనేది ఏదో ప్రభుత్వంతో తేల్చుకుంటామని చెప్పి టీకాంగ్రెస్ నేతలు అక్కడి నుండి వెళ్లిపోయారు.