తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి నడుచుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. 2017 ఏప్రిల్‌లో శ్రీరామ నవమిని పునస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించగా దానిపై అదే ఏడాది నవంబర్ లో ఓ కేసు నమోదైందని గతంలో జరిగిన ఈ రెండు ఘటనలను ట్విటర్ ద్వారా గుర్తు చేసిన రాజాసింగ్.. ఆ కేసుకు సంబంధించిన కాపీ తనకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అందింది అని అందులో పేర్కొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు తనను పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారని చెబుతూ.. తనపై ఎటువంటి ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ సందర్భంగా రాజా సింగ్ స్పష్టంచేశారు. అంతేకాకుండా తనపై ఒత్తిళ్లు తీసుకురావాలనుకోవడం ఓ విఫలయత్నమే అవుతుందని రాజా సింగ్ ధీమా వ్యక్తంచేశారు.