హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కీలక నేతల్లో ఒకరైన సోమారపు సత్యనారాయణ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు డా కే లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, టీఎస్ఆర్టీసి చైర్మన్‌గా సేవలు అందించిన సోమారపు సత్యనారాయణ.. టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. సోమారపు సత్యనారాయణ వెంట బీజేపీలో చేరినవారిలో రామగుండం నుంచి ఆరుగురు కార్పోరేటర్లు కూడా ఉన్నారు. 


సోమారపు సత్యనారాయణను పార్టీలో చేర్పించడంలో బీజేపీ ఎంపీలు సంజయ్, అరవింద్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.